Tuesday, May 8, 2012

రాష్టప్రతిగా ప్రతిభాపాటిల్ చివరి విదేశీ పర్యటన పూర్తి

న్యూఢిల్లీ, మే 8:  రాష్టప్రతి ప్రతిభాపాటిల్ తొమ్మిది రోజుల విదేశీ పర్యటన ముగించుకుని మంగళవారం స్వదేశం చేరుకున్నారు. ప్రతిభాపాటిల్ రాష్టప్రతి హోదాలో చేసిన చివరి విదేశీ పర్యటన ఇదే. జూలై 25తో ఆమె పదవీకాలం ముగియనుంది. ప్రతిభాపాటిల్ విదేశీ పర్యటన అనేక వివాదాలకు దారితీసిన సంగతి తెలిసిందే. గత నెల 29న ఆఫ్రికాదేశమైన సెచెల్లస్, దక్షిణాఫ్రికాలో పర్యటనకు వెళ్ళారు. ఈ సందర్భంగా భారత్- దక్షిణాఫ్రికా మధ్య పలు ఒప్పందాలు చేసుకున్నారు. సెచెల్లస్‌తో రెండు కీలకమైన ఎంఓయులపై రాష్టప్రతి సంతకాలు చేశారు. ఇరవై రెండేళ్ళ తరువాత ఆ దేశంలో పర్యటించిన రెండో భారత రాష్టప్రతి ప్రతిభాపాటిలే. ఇండియన్ బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చ్ డెవలప్‌మెంట్‌లో సెచెల్లస్ పోలీసులకు శిక్షణతో పాటు యువజన సర్వీసులు, క్రీడలకు సంబంధించి ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. సౌతాఫ్రికాతో 15 యుఎస్‌టి బిలయన్ల విలువైన వాణజ్య ఒప్పందం చేసుకున్నారు. జొహెనె్సస్‌బర్గ్‌లోని ఓల్డ్ పోర్టు జైలులో గాంధీ విగ్రహాన్ని రాష్టప్రతి ప్రతిభాపాటిల్ ఆవిష్కరించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...