న్యూఢిల్లీ, మే 8: రాష్టప్రతి ప్రతిభాపాటిల్ తొమ్మిది రోజుల విదేశీ పర్యటన ముగించుకుని మంగళవారం స్వదేశం చేరుకున్నారు. ప్రతిభాపాటిల్ రాష్టప్రతి హోదాలో చేసిన చివరి విదేశీ పర్యటన ఇదే. జూలై 25తో ఆమె పదవీకాలం ముగియనుంది. ప్రతిభాపాటిల్ విదేశీ పర్యటన అనేక వివాదాలకు దారితీసిన సంగతి తెలిసిందే. గత నెల 29న ఆఫ్రికాదేశమైన సెచెల్లస్, దక్షిణాఫ్రికాలో పర్యటనకు వెళ్ళారు. ఈ సందర్భంగా భారత్- దక్షిణాఫ్రికా మధ్య పలు ఒప్పందాలు చేసుకున్నారు. సెచెల్లస్తో రెండు కీలకమైన ఎంఓయులపై రాష్టప్రతి సంతకాలు చేశారు. ఇరవై రెండేళ్ళ తరువాత ఆ దేశంలో పర్యటించిన రెండో భారత రాష్టప్రతి ప్రతిభాపాటిలే. ఇండియన్ బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చ్ డెవలప్మెంట్లో సెచెల్లస్ పోలీసులకు శిక్షణతో పాటు యువజన సర్వీసులు, క్రీడలకు సంబంధించి ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. సౌతాఫ్రికాతో 15 యుఎస్టి బిలయన్ల విలువైన వాణజ్య ఒప్పందం చేసుకున్నారు. జొహెనె్సస్బర్గ్లోని ఓల్డ్ పోర్టు జైలులో గాంధీ విగ్రహాన్ని రాష్టప్రతి ప్రతిభాపాటిల్ ఆవిష్కరించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment