అన్నవరం, మే 2: రత్నగిరిపై కొలువైన శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి అమ్మవార్ల దివ్యకల్యాణ మహోత్సవం వైశాఖశుద్ధ ఏకాదశి బుధవారం రాత్రి కన్నులపండువగా జరిగింది. వేలాదిమంది భక్తులు తిలకిస్తుండగా శాస్త్రోక్తంగా అర్చకస్వాములు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి నూతనాలయంలో స్వామి, అమ్మవార్లు కొలువైన తర్వాత జరిగిన ఈ ఉత్సవానికి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం గురుమూఢం కారణంగా వివాహముహూర్తాలు లేకపోయినా స్వామివారి కల్యాణం లోకకల్యాణార్థం ఏటా ఇదేరోజున జరుగుతున్న కార్యక్రమమైనందున అటువంటి పట్టింపులుండవని పండితులు తెలిపారు. రత్నగిరి రామాలయం పక్కనే గల వార్షిక కల్యాణ వేదికపై స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. క్షేత్ర పాలకులు సీతారాముల పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment