ఎయిరిండియాకు అమెరికా ఫైన్...

వాషింగ్టన్,మే 6: ఇప్పటికే  నష్టాలు, రుణాల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వరంగ విమానయానసంస్థ ఎయిరిండియాకు మరో కష్టం వచ్చి  పడింది. సర్వీసులు, ఫీజుల గురించిన సమాచారాన్ని వెబ్‌సైట్లో ఉంచకపోవడం, ప్రయాణికులకు సరిగ్గా తెలియజేయకపోవడం వంటి కారణాలతో ఎయిరిండియాకు  అమెరికా 80,000 డాలర్ల (సుమారు రూ. 42 లక్షలు) జరిమానా విధించింది. విమాన ప్రయాణికులకు సంబంధించి గతేడాది ఆగస్టు నుంచి అమెరికా ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పట్నుంచీ.. విధించిన తొలి జరిమానా ఇదే. నిబంధనల ప్రకారం ఫ్లైట్ జాప్యం జరిగితే ఏ విధమైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేదీ, వసూలు చేసే వివిధ రకాల ఫీజులు మొదలైన వివరాలను ఎయిర్‌లైన్స్ విధిగా తమ వెబ్‌సైట్లో పేర్కొనాల్సి ఉంటుంది. అయితే, కస్టమర్ సర్వీసు, అత్యవసర ప్రణాళికలు మొదలైన వివరాలను ఎయిరిండియా తన వెబ్‌సైట్లో ఉంచలేదని అమెరికా ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్  తెలిపింది. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు