Wednesday, May 30, 2012

నర్సన్నపేటలో విజయమ్మ రోడ్ షో

మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకోవాలని తళ్ళీకూతుళ్ళ పిలుపు 
శ్రీకాకుళం,మే 30:   వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మశ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలోరోడ్ షో నిర్వహిస్తూ తొలి ఎన్నికల ప్రసంగం చేశారు,  జగన్‌కు జరిగిన అన్యాయాన్ని,  రాజశేఖర రెడ్డిపై జరిగిన కుట్రను, తన కడుపు మంటను  గుర్తు పెట్టుకుని ఓటు వేయాలని పిలుపు ఇచ్చారు.    వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆమె పిలుపు ఇచ్చారు. పాదయాత్ర అనుభవాలను, అంతకు ముందటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి అయిన తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, పార్టీలకూ మతాలకూ కులాలకూ అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలని వైయస్ ఆశించారని, ఆ పథకాలు ఎలా అమలవుతున్నాయో చూడడానికే రచ్చబండ కార్యక్రమానికి ఆ రోజు బయలుదేరారని అన్నారు. రైతుల కోసమే అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చి కాంగ్రెసు నుంచి బయటకు వచ్చిన తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. ప్రతి అన్యాయానికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ప్రస్తుత ఉప  ఎన్నికలు  రాష్ట్ర రాజకీయాలను మార్చే ఎన్నికలని అన్నారు. ఆమె పక్కనే కూతురు షర్మిళ పార్టీ గుర్తు ఫ్యాన్‌ను ప్రదర్సిస్తూ ,జగనన్నను అన్యాయంగా అరెస్టు చేశారని అన్నారు. తమ కన్నీటిని చూసి నవ్వుతున్నవారికి గుణపాఠం చెప్పాలని ఆమె ప్రజలను కోరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేసి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు బుద్ధి చెప్పాలని,   మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకోవాలని, జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆమె పిలుపు ఇచ్చారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...