న్యూఢిల్లీ, మే 5: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. దివంగత నేత డాక్టర్ వైఎస్ హయాం లో దీని నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 40వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలోని 7 జిల్లాలకు 160 టిఎంసిల సాగునీరు, తాగు నీరు అందుతుంది. హైదరాబాద్కు కూడా 30 టీఎంసీల తాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రాంతానికి లైఫ్లైన్ లాంటిదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. నిర్దిష్ట కాలపరిమితిలోనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రాజెక్టు డిజైన్ మార్పులపై నిపుణుల కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు. ప్రాజెక్టు జాతీయ హోదా సాధించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని చెప్పారు. మహారాష్ట్ర ముందుకు రావడం వల్ల ముంపు సమస్య పరిష్కారం సులభతరం అయిందన్నారు. ఇతర రాష్ట్రాలతో వివాదాలను పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కృష్ణా జలాల అంశంపై టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment