Wednesday, May 2, 2012

చిదంబరం నోట అదే మాట...

కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రంపై రుద్దలేం
ఏపీలో పార్టీలన్నీ చీలిపోయాయి

 న్యూఢిల్లీ, మే 2: కేంద్ర హోంమంత్రి చిదంబరం 'ఇప్పట్లో తెలంగాణపై స్పష్టత ఇవ్వలేం' అని తేల్చేశారు. లోక్‌సభలో బుధవారం టీఆర్ఎస్, టీడీపీ ఎంపీల నినాదాలు... కాంగ్రెస్ తనవైఖరి చెప్పాల్సిందేనన్న డిమాండ్ల నేపథ్యంలో  'ఇప్పట్లో తేల్చే అవకాశమే లేదు' అని చిదంబరం అంతే స్పష్టంగా చెప్పేశారు.  'కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రంపై రుద్దం. తెలంగాణ ఇచ్చేదీ లేనిదీ స్పష్టంగా చెప్పలేను. నేనేకాదు... ఏ హోంమంత్రీ చెప్పలేరు. అక్కడి పరిస్థితి మీకందరికీ తెలుసు' అన్నారు.  పార్టీలన్నీ సాధ్యమైనంత త్వరగా తమ వైఖరి వెల్లడించాలనేలా మాట్లాడిన చిదంబరం... దీనికి నిర్దిష్టమైన గడువేమీ లేదని, మరింత సమయం తీసుకున్నా అభ్యంతరమేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ మాత్రం త్వరలోనే తన వైఖరి చెబుతుందన్నారు. 'తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ నివేదికే ప్రాతిపదిక గా ఉంటుంది'' అని చిదంబరం స్పష్టం చేశారు. పరిస్థితులు అందరికీ తెలిసినవే. ఈ అంశంపై (తెలంగాణ) ప్రతి పార్టీ కూడా చీలిపోయింది'' అని చెప్పారు. 2009 డిసెంబర్ 9న పార్లమెంటులో తాను ప్రకటన చేసేప్పటికి రెండు రోజుల ముందు ఆంధ్రప్రదేశ్‌లో.. తెలంగాణపై అఖిలపక్ష సమావేశం జరిగిందని గుర్తుచేశారు. తాను ప్రకటన చేసిన రోజున ఇదే అంశంపై లోక్‌సభ బీఏసీ కూడా చర్చించిందని వెల్లడించారు. తాను ప్రకటన చేసిన 24 గంటల్లోనే పరిస్థితులు నాటకీయంగా మారిపోయాయని, అధికారంలో ఉన్న తమ కాంగ్రెస్ పార్టీతో సహా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ తమ వైఖరిని మార్చేసుకున్నాయని చెప్పారు. ఈ పరిణామాల కారణంగానే 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటనను.. అదే ఏడాది డిసెంబర్ 23న మార్చాల్సి వచ్చిందని వివరించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...