విశాఖపట్నం, మే 31: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ గురువారం తన ప్రచారంలో కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె తన కూతురు షర్మిళతో పాటు పాయకరావుపేట ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారానికి వచ్చే ముందు తాను జైలులో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చానని, జగన్ చాలా ధైర్యంగా, నమ్మకంగా ఉన్నాడని, తాను ఏ తప్పు చేయలేదని తనతో చెప్పాడని అన్నారు. ధైర్యంగా ఉండమని తనకూ చెప్పాడన్నారు.ఉప ఎన్నికలలో అభ్యర్థులను గెలిపించాలని చెప్పాలని తనకు సూచించాడన్నారు. వైయస్ కాంగ్రెసును కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకు వచ్చి, ప్రజల కోసం పథకాలు ప్రవేశపెడితే ఇప్పుడు ఆయనను దోషిగా చిత్రీకరించే కుట్ర జరుగుతోందన్నారు. హెలికాప్టర్ ప్రమాదంపై తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. సిబిఐ విచారణ సజావుగా సాగిందని తాను భావించడం లేదన్నారు. తన సోదరుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైలుకు పంపించారని షర్మిళ ఆరోపించారు. కుట్ర రాజకీయాలకు ఉప ఎన్నికలలో బుద్ధి చెప్పాలన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment