కన్నీటికి ఓట్లు రాలేనా...

విశాఖపట్నం, మే 31:   వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ గురువారం తన ప్రచారంలో కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె తన కూతురు షర్మిళతో పాటు పాయకరావుపేట ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారానికి వచ్చే ముందు తాను జైలులో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చానని, జగన్ చాలా ధైర్యంగా, నమ్మకంగా ఉన్నాడని, తాను ఏ తప్పు చేయలేదని తనతో చెప్పాడని అన్నారు. ధైర్యంగా ఉండమని తనకూ చెప్పాడన్నారు.ఉప ఎన్నికలలో అభ్యర్థులను గెలిపించాలని చెప్పాలని తనకు సూచించాడన్నారు. వైయస్ కాంగ్రెసును కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకు వచ్చి, ప్రజల కోసం పథకాలు ప్రవేశపెడితే ఇప్పుడు ఆయనను దోషిగా చిత్రీకరించే కుట్ర జరుగుతోందన్నారు. హెలికాప్టర్ ప్రమాదంపై తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. సిబిఐ విచారణ సజావుగా సాగిందని తాను భావించడం లేదన్నారు. తన సోదరుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైలుకు పంపించారని షర్మిళ ఆరోపించారు. కుట్ర రాజకీయాలకు ఉప ఎన్నికలలో బుద్ధి చెప్పాలన్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు