రుణ భారానికి విరుగుడు చర్యలు
న్యూఢిల్లీ,మే 19: ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో కేంద్రం పలు పొదుపు చర్యలు ప్రకటించింది. మంత్రులు, అధికారుల విదేశీ ప్రయాణాలకు కోత, ఫైవ్స్టార్ హోటళ్లలో సమావేశాలకు స్వస్తి, వర్క్ షాపులు, సెమినార్ల బడ్జెట్లో 10 శాతం తగ్గింపు, రక్షణ బలగాలకు మినహా ఇతర విభాగాలకు వాహనాల కొనుగోళ్లపై నిషేధం.. మొదలైన పొదుపు చర్యలనుఆర్థిక శాఖ సహాయ మంత్రి నమోనారాయణ్ మీనా లోక్సభలో వీటిని ప్రకటించారు. ఈ పొదుపు చర్యలు గత ఏడాది సమర్థంగా అమలుకాకపోవడంతో సర్కారు వీటిని మరింత పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ చర్యలను వ్యవస్థాగత వ్యయాల్లో కోత, పథకాలవారీ వ్యయాల తగ్గింపు అనే రెండు రకాలుగా చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశీ, విదేశీ రుణాలు భారీగా పెరిగిన నేపథ్యంలో సర్కారు పొదుపు చర్యలకు సిద్ధమైంది. 2010-11 ఆర్థిక సంవత్సరం ఖాతాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం రూ.37 లక్షల కోట్ల దేశీ రుణాలను, రూ.1.5 లక్షల కోట్ల విదేశీ రుణాలను చెల్లించాల్సి ఉంది.

Comments