Sunday, May 6, 2012

కాంగ్రెస్ లోనే ఉంటాం...

చిత్తూరు,మే 6:  తాము కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతామని సినీ హీరో రాజశేఖర్  స్పష్టం చేశారు. తన సతీమణి, దర్శక నిర్మాత జీవితతో కలిసి ఆయన ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ,    తాము కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతామని, త్వరలో జరగనున్న పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గాలలో జరగనున్న ఉప ఎన్నికలలో తాము కాంగ్రెసు పార్టీ తరఫునే ప్రచారం చేస్తామని తెలిపారు. ఇతర పార్టీలలో చేరే విషయమై ఆయా నేతలతో చర్చలు జరిపింది నిజమేనని వారు చెప్పారు. తాము కాంగ్రెసు పార్టీలో చేరడం లేదని, కాంగ్రెసు పార్టీలోనే ఉన్నామని చెప్పారు. పార్టీ ఎక్కడ ప్రచారం చేయమని ఆదేశిస్తే అక్కడ ప్రచారం చేయడానికి  సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
కాగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత రాజశేఖర్ దంపతులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. అయితే ఇరువురి మధ్యన పొసగక పోవడంతో వారు జగన్‌కు దూరమయ్యారు. . అనంతరం వారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు సంప్రదింపులు జరిపారు. అయితే ఇటీవల అరెస్టైన తారా చౌదరి కేసులో రాజశేఖర్ పేరు ఉందనే వార్తలు వచ్చిన  నేపథ్యంలో వారికి తెలుగుదేశం పార్టీ తలుపులు తెరవలేదని తెలుస్తోంది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.  కానీ,  తారా కేసులో రాజశేఖర్ ఉండటంపై బిజెపిలో తర్జన భర్జన జరిగిందని, చివరకు ఆ పార్టీ కూడా తలుపులు మూసివేసిందంటున్నారు. దీనితో  వారి  కాంగ్రెసులోనే కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...