Wednesday, May 2, 2012

మళ్లీ రూపాయి క్షీణత

ముంబై,మే 2: రిజర్వ్ బ్యాంక్ జోక్యంతో కొన్నాళ్ల క్రితం పుంజుకున్న రూపాయి..  మళ్లీ పతనమవుతూ కలవరపెడుతోంది. రెండు నెలల వ్యవధిలోనే డాలర్‌తో పోలిస్తే దాదాపు నాలుగు వందల పైసల మేర క్షీణించి 53 స్థాయికి చేరువలో ఉంది. అంతర్జాతీయ పరిణామాలకు తోడు దేశీయంగా ఆర్థిక లోటు పెరిగిపోవడం, భారత్ అంచనాలను రేటింగ్ ఏజెన్సీలు తగ్గించడం, దేశ భవిష్యత్‌పై ఇన్వెస్టర్లలో సందేహాలు రేకెత్తడం తదితర అంశాలన్నీ కూడా కరెన్సీ క్షీణతకు కారణమవుతున్నాయి. దిగుమతి చేసుకునే వాటిలో కొన్నింటి రేట్లు అంతర్జాతీయంగా తగ్గినా.. రూపాయి విలువ క్షీణత కారణంగా ఆ ప్రయోజనాలేమీ దక్కే పరిస్థితి లేదు. పెపైచ్చు రోజుకో వస్తువు ధర అంతకంతకూ పెరుగుతోంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...