వంశీకి షోకాజ్ పై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం ?
హైదరాబాద్,మే 2: తనకు సన్నిహితుడైన తెలుగుదేశం విజయవాడ నాయకుడు వల్లభనేని వంశీకి పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేయడంపై సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తన సినిమా దమ్ము విడుదల రోజున బందర్ పోర్టు సాధన కోసమంటూ తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా బంద్ నిర్వహించడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. వంశీకి షోకాజ్ నోటీసు జారీ, దమ్ము సినిమా విడుదల రోజు కృష్ణా జిల్లా బంద్ తనకు వ్యతిరేకంగా కావాలని చేసిందనే అభిప్రాయంతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. ఆ రెండు విషయాలపై జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే, ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తూనే తన ప్రణాళికను అమలు చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
Comments