న్యూఢిల్లీ, మే 31: అత్యంత వివాదాస్పద సైన్యాధిపతిగా పేరొందిన జనరల్ వికె సింగ్ గురువారం పదవీ విరమణ చేశారు. తన పదవి విరమణ వయస్సు విషయంలో ప్రభుత్వాన్నే కోర్టుకీడ్చి రికార్డు సృష్టించిన ఆయన ప్రభుత్వం పట్టుదల, కోర్టు తీర్పులకు మెట్టుదిగి, బెట్టువీడి చివరకి పదవి విరమణ చేయక తప్పలేదు. అటు అత్యంత సమర్థుడుగా, ఇటు అతి వివాదాస్పదుడిగా జనరల్ వికె సింగ్ చరిత్రలో నిలిచిపోయారు. తనకే తోటి అధికారులు లంచం ఇవ్వజూపారని వెల్లడించి, సుక్నా భూ కుంభకోణంలో నిందితులకు శిక్షలు వేసి ఆయన ఆర్మీలో అవినీతి వ్యతిరేక పోరాట యోధుడిగా వార్తల్లో నిలిచారు. మరో వైపు ఆర్మీలో వర్గపోరుకు తెరతీసిన వ్యక్తిగా, రక్షణశాఖతో బాహీబాహీకి దిగిన వ్యక్తిగా ఆయన మిగిలిపోయారు. మొత్తం మీద ప్రత్యక్ష యుద్ధాల్లో స్వయంగా పాల్గొని, సేనలను నడిపించిన అనుభవం ఉన్న వికె సింగ్ సైనిక జీవన చరమాంకం వివాదాస్పదంగా మిగిలిపోయింది. చిట్టచివరి అధికారిక కార్యక్రమంలో జనరల్ వికె సింగ్ అమరజవాన్లకు నివాళి అర్పించారు. ఆయన స్థానంలో జనరల్ విక్రమ్ సింగ్ సేనాధ్యక్షుడిగా రెండేళ్లపాటు బాధ్యతలు నిర్వహిస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment