జగన్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే రంగారావు
విజయనగరం,మే 30: బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ వెంకట రంగారావు బుధవారం తన శాసన సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనితో విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకిఎదురుదెబ్బ తగిలినట్లయింది. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు పట్టున్న ఈ జిల్లా నుంచి ఓ శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీని వీడి వైరివర్గంలో చేరడం ఇదే ప్రథమం. దీనితో జిల్లాలో రాజకీయ సమీరకణాలు మారే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న బొబ్బిలి నియోజకవర్గం నుంచి రంగారావు వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. మంత్రి పదవిని ఆశించారు. అయితే బొత్స కుటుంబ హవా నేపథ్యంలో రంగారావుకి మంత్రివర్గంలో చోటు దక్కలేదు.దీనితో అసంతృప్తితో ఉన్న రంగారావు కొద్ది రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు దృష్టి సారించారు. రంగారావు ఇటీవల హైదరాబాదు వచ్చి వైయస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. తాను జగన్కు సంఘీభావం తెలియజేయడానికి మాత్రమే వచ్చానని ఆయన అప్పట్లో చెప్పారు.
విజయనగరం,మే 30: బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ వెంకట రంగారావు బుధవారం తన శాసన సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనితో విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకిఎదురుదెబ్బ తగిలినట్లయింది. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు పట్టున్న ఈ జిల్లా నుంచి ఓ శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీని వీడి వైరివర్గంలో చేరడం ఇదే ప్రథమం. దీనితో జిల్లాలో రాజకీయ సమీరకణాలు మారే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న బొబ్బిలి నియోజకవర్గం నుంచి రంగారావు వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. మంత్రి పదవిని ఆశించారు. అయితే బొత్స కుటుంబ హవా నేపథ్యంలో రంగారావుకి మంత్రివర్గంలో చోటు దక్కలేదు.దీనితో అసంతృప్తితో ఉన్న రంగారావు కొద్ది రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు దృష్టి సారించారు. రంగారావు ఇటీవల హైదరాబాదు వచ్చి వైయస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. తాను జగన్కు సంఘీభావం తెలియజేయడానికి మాత్రమే వచ్చానని ఆయన అప్పట్లో చెప్పారు.
No comments:
Post a Comment