Friday, May 25, 2012

జగన్ తో చేతులు కలపిన మైసూరా...టి.డి.పి. నుంచి సస్పెన్షన్

హైదరాబాద్,మే 25:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోసం తాను ఏమైనా చేస్తానని మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యుడు ఎం. వి మైసురా రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం ఉదయం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. దీంతో ఆయనను తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. తనకు వైయస్ జగన్ చిన్నప్పటి నుంచీ తెలుసునని, రాజకీయంగా ఎదుగుతున్న వ్యక్తి అని, జగన్ ఎదుగుదలను చూసి ఓర్వలేక మూకుమ్మడి దాడి చేస్తున్నారని ఆయన అన్నారు. చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి కావడంతో పలకరించడానికి వచ్చానని ఆయన అన్నారు. తనకు సాయం చేయాలని వైయస్ జగన్ కోరారని, అందుకు తాను సమ్మతించానని ఆయన చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భవిష్యత్తు కోసం, జగన్ శ్రేయస్సు కోసం ఎలాంటి పనైనా చేస్తానని ఆయన అన్నారు. జగన్‌ను అరెస్టు చేయడానికే  మంత్రి మోపిదేవి వెంకటరమణను అరెస్టు చేశారని ఆయన అన్నారు. మోపిదేవిని బలిపశువును చేస్తున్నారని ఆయన అన్నారు. చట్టం తన పని చేస్తుంటే సంతోషించేవాడినని, ఒత్తిళ్లు పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కోసం పనిచేస్తానని, అందులో చేరడం చేరకపోవడం అనేది సమస్య కాదని ఆయన అన్నారు. కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సలహాదారుగా ఎంవి మైసురా రెడ్డిని నియమించుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...