కాంగ్రెస్ పార్టీకి వైఎస్ వివేకా గుడ్బై
పులివెందుల: కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పార్టీని రెండు సార్లు అధికారంలోకి
తీసుకువచ్చిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని
దూషిస్తున్న తీరుపై కలత చెంది కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెబుతున్నట్టు
వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి ప్రకటించారు. పులివెందులలో ఏర్పాటు
చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైస్ను విమర్శిస్తే సహించలేమని
వివేకానంద రెడ్డి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్
పార్టీలో ఉండలేకపోతున్నానని , కాంగ్రెస్కు దూరంగా
ఉండాలనుకుంటున్నానని ఆయన తెలిపారు. భవిష్యత్ కార్యచరణపై త్వరలోనే నిర్ణయం
తీసుకుంటానని వివేకానంద అన్నారు. పులివెందులలో కార్యకర్తలతో, వైఎస్
అభిమానులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం.. పార్టీని వీడుతున్నట్టు వైఎస్
వివేకానందరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.

Comments