పులివెందుల: కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పార్టీని రెండు సార్లు అధికారంలోకి
తీసుకువచ్చిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని
దూషిస్తున్న తీరుపై కలత చెంది కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెబుతున్నట్టు
వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి ప్రకటించారు. పులివెందులలో ఏర్పాటు
చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైస్ను విమర్శిస్తే సహించలేమని
వివేకానంద రెడ్డి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్
పార్టీలో ఉండలేకపోతున్నానని , కాంగ్రెస్కు దూరంగా
ఉండాలనుకుంటున్నానని ఆయన తెలిపారు. భవిష్యత్ కార్యచరణపై త్వరలోనే నిర్ణయం
తీసుకుంటానని వివేకానంద అన్నారు. పులివెందులలో కార్యకర్తలతో, వైఎస్
అభిమానులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం.. పార్టీని వీడుతున్నట్టు వైఎస్
వివేకానందరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment