Friday, May 25, 2012

ఎనిమిది గంటల సేపు జగన్ విచారణ

హైదరాబాద్,మే 25: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని సిబిఐ  శుక్రవారం నాడు  దాదాపు ఎనిమిది గంటల సేపు విచారించింది. బయటకు వచ్చిన తరువాత జగన్ విలేకరులతో మాట్లాడుతూ సిబిఐ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు తెలిపారు. వారు అడిగిన వివరాలను ప్రశాంతంగా వివరించినట్లు చెప్పారు. శనివారం  మళ్లీ విచారణకు రమ్మన్నట్లు ఆయన తెలిపారు. శనివారం  ఉదయం 10.30 గంటలకు జగన్ మరోసారి సిబిఐ ఎదుట హాజరవుతారు. వైయస్ జగన్ సిబిఐ విచారణ ముగిసి బయటకు వచ్చే వరకు కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలను విచారణ అనంతరం ఐదు గంటలకు చంచల్‌గుడా జైలుకు తరలించారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ విచారణను కూడా ముగించారు. ఆ తర్వాత కూడా జగన్‌ను విచారించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయనను అరెస్టు చేస్తారా అనే సందేహం తలెత్తింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...