Saturday, May 5, 2012

భానూ నేరాలు ఇన్నిన్ని కాదయా...

హైదరాబాద్, మే 5:  తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి హత్య కోసం మొద్దు శీనుకు కోటి రూపాయలు ఇచ్చినట్లు మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ చెప్పాడు. సిఐడి కోర్టుకు సమర్పించిన నేరాంగీకార పత్రంలో అతను పలు  విషయాలు వెల్లడించాడు. హంద్రీనీవా ప్రాజెక్టు సెటిల్మెంట్లలో వచ్చిన డబ్బులన్నీ పంపిణీ చేశామని అతను చెప్పాడు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత సూరి పేరు మీద 25 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు అతను చెప్పాడు.  పులివెందుల కృష్ణకు కోటీ 30 లక్షల రూపాయలు ఇచ్చినట్లు భాను కిరణ్ చెప్పాడు. జల్సాలకు 40 లక్షల రుపాయలు ఖర్చయ్యాయని  చెప్పాడు. సూరి సోదరి హేమలతా రెడ్డికి 40 లక్షల రూపాయలు ఇచ్చినట్లు  తెలిపాడు. హంద్రీనీవా 72 కోట్ల రూపాయల 7వ ప్యాకేజీ జెకె కన్‌స్ట్రక్షన్‌కు వచ్చే చూశామని, తమకు 8.6 కోట్ల రూపాయలు కమిషన్ వచ్చిందని, దాన్ని నిరంజన్ రెడ్డి అనే వ్యక్తికి ఇచ్చామని అతను చెప్పాడు. 38 కోట్ల రూపాయల ఐదో ప్యాకేజీ కాంట్రాక్టులో సహకరించినందుకు 3.5 కోట్లు రూపాయలు తీసుకున్నామని  చెప్పాడు. ఆరో ప్యాకేజీ కూడా ఓ సంస్థకు రావడానికి సహకరించామని అతను చెప్పాడు. అన్నపూర్ణ ప్యాకేజింగ్ విషయంలోనే సూరితో విభేదాలు వచ్చినట్లు అతను చెప్పాడు. సూరి హత్య తర్వాత ఉమాశంకర్ అనే వ్యక్తి 50 వేల రూపాయలు ఇచ్చాడని, అతనే సిమ్ కార్డు కూడా ఇచ్చాడని, దాంతో సూరి హత్య తర్వాత ఢిల్లీలోని శర్మ లాడ్జిలో ఉన్నానని, సింప్లెక్స్ ఉద్యోగిగా చెలామణి అయ్యాయని అతను చెప్పాడు. సూరి హత్యకు టచ్ పబ్‌లో ప్రణాళిక రచించినట్లు అతను తెలిపాడు. సినీ నిర్మాత సింగనమల రమేష్, మన్మోహన్ సింగ్‌తో కలిసి శంషాబాద్‌లో సూరి హత్యకు ఆరు రౌండ్ల టెస్ట్ ఫైరింగ్ జరిపినట్లు అతను తెలిపాడు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...