Thursday, May 3, 2012

మావోల చెర నుండి కలెక్టర్ పాల్ విడుదల

రాయపూర్,మే 3: మావోల చెర నుంచి చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ గురువారం మధ్యాహ్నం విడుదలయ్యారు. చత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి, మావోయిస్టులకు మధ్యవర్తులుగా వ్యవహరించిన బిడి శర్మ, ప్రొఫెసర్ హరగోపాల్‌కు కలెక్టర్ మీనన్‌ను మావోయిస్టులు తాడిమెట్ల అడవులలో అప్పగించారు.  గత నెల ఏప్రిల్ 21వ తేదిన కలెక్టర్ అలెక్స్ మీనన్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఆయనను విడుదల చేయించడానికి బిడి శర్మ, హరగోపాల్ మధ్యవర్తులుగా వ్యవహరించారు. వారి కృషి ఫలించింది. వీరు నాలుగు దఫాలుగా అటు ప్రభుత్వం, ఇటు మావోయిస్టులతో చర్చలు జరిపారు.కాగా కలెక్టర్ విడుదలకు మావోయిస్టులు పెట్టిన పలు ఒప్పందాలకు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఆయనను విడుదల చేశారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...