మెల్బోర్న్,మే 2: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో భారత సంతతికి చెందిన ఓ కుటుంబం అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడింది. నీలేష్ శర్మ(34), అతడి భార్య ప్రీతిక(32), వారి పిల్లలు దివేష్(5), దివ్య(3)ల మృతదేహాలను గ్లెన్ వేవర్లీలోని వారి నివాసంలో కనుగొన్నారు. నీలేష్ మృతదేహం హాల్లో పడివుండగా మిగతా ముగ్గురు పడకగదిలో నిర్జీవులుగా కనిపించారు. ఫిజీ-భారత సంతతికి చెందిన నీలేష్ కుటుంబం దశాబ్దం క్రితం ఆస్ట్రేలియాకు వలస వచ్చింది. ఎకౌంటెంట్గా పనిచేస్తున్న నీలేష్ గత రెండేళ్లుగా గ్లెన్ వేవర్లీలో నివసిస్తున్నారు. అయితే వీరి మరణానికి గల కారణాలు వెల్లడికాలేదు. హత్య-ఆత్మహత్య కింద పోలీసులుకేసు నమోదు చేశారని ఏఏపీ వార్తా సంస్థ పేర్కొంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment