మెల్‌బోర్న్ లో భారత సంతతి కుటుంబం అనుమానాస్పద మృతి

మెల్‌బోర్న్,మే 2:  ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ లో భారత సంతతికి చెందిన ఓ కుటుంబం అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడింది. నీలేష్ శర్మ(34), అతడి భార్య ప్రీతిక(32), వారి పిల్లలు దివేష్(5), దివ్య(3)ల మృతదేహాలను గ్లెన్ వేవర్లీలోని వారి నివాసంలో కనుగొన్నారు. నీలేష్ మృతదేహం హాల్లో పడివుండగా మిగతా ముగ్గురు పడకగదిలో నిర్జీవులుగా కనిపించారు. ఫిజీ-భారత సంతతికి చెందిన నీలేష్ కుటుంబం దశాబ్దం క్రితం ఆస్ట్రేలియాకు వలస వచ్చింది. ఎకౌంటెంట్‌గా పనిచేస్తున్న నీలేష్ గత రెండేళ్లుగా గ్లెన్ వేవర్లీలో నివసిస్తున్నారు. అయితే వీరి మరణానికి గల కారణాలు వెల్లడికాలేదు. హత్య-ఆత్మహత్య కింద పోలీసులుకేసు నమోదు చేశారని ఏఏపీ వార్తా సంస్థ పేర్కొంది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు