విడాకుల ప్రక్రియ సులభతరం

న్యూఢిల్లీ,మే 1:   హిందూ వివాహ చట్టం-2007, ప్రత్యేక వివాహ చట్టం-1954లకు సవరణలు చేస్తూ వివాహ చట్టం(సవరణ)బిల్లు-2010ని న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సవరణ చట్టం ద్వారా విడాకులు పొందడం తేలికవుతుందని తెలిపారు. దీనివల్ల విడిపోయిన భార్యాభర్తలకు చెందిన పిల్లలకు రక్షణ ఏర్పడుతుందని, భర్త ఆస్తిలో భార్యకు హక్కు ఉంటుందని వివరించారు. కాగా, బిల్లులోని కొన్ని అంశాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని బీజేపీ సభ్యుడు అరుణ్ జైట్లీ విమర్శించారు. ఈ బిల్లు వల్ల ఉపయోగాలకన్నా మహిళలకు చేటే ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. దీనిని తాము వ్యతిరేకిస్తున్నట్టు అరుణ్‌జైట్లీ తెలిపారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు