Wednesday, May 23, 2012

భగ్గుమన్న పెట్రోల్: ఏకంగా లీటరుకు రూ.7.50 పెంపు

న్యూఢిల్లీ,మే 23: కేంద్రం మరోసారి పెట్రోలు ధరలను భారీగా  పెంచింది. ఏకంగా లీటరుకు రూ.7.50 రూపాయలు పెరిగింది. రాష్ట్రంలో పన్ను రూపేణా మరికొంత అదనపు బాదుడు తప్పకపోవడంతో ఈ పెంపునకు మరికొంత మొత్తం చేరి అది రూ.9కి చేరుకుంటుంది. మొత్తంగా రాష్ట్రంలో లీటరు పెట్రోలు ధర రూ.82కు చేరుకోనుంది. రాష్ట్రీయ ఆయిల్ ఉత్పత్తి కంపెనీలు లీటరుకి పెంచమని కోరిన రూ.6.28 కంటే ఇది ఎక్కువ మొత్తం కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ క్షీణించడంతో డాలర్‌కు డిమాండ్ పెరిగింది.  డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.56కు చేరుకుంది. ఈ పరిణామంతో వేల కోట్ల రూపాయల నష్టం వస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు పేర్కొన్నాయి. పెట్రో ధరలపై నియంత్రణ లేకపోవడంతో ఆయా కంపెనీలు ప్రతిపాదించిన మొత్తం పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...