న్యూఢిల్లీ,మే 23: కేంద్రం మరోసారి పెట్రోలు ధరలను భారీగా పెంచింది. ఏకంగా లీటరుకు రూ.7.50 రూపాయలు పెరిగింది. రాష్ట్రంలో పన్ను రూపేణా మరికొంత అదనపు బాదుడు తప్పకపోవడంతో ఈ పెంపునకు మరికొంత మొత్తం చేరి అది రూ.9కి చేరుకుంటుంది. మొత్తంగా రాష్ట్రంలో లీటరు పెట్రోలు ధర రూ.82కు చేరుకోనుంది. రాష్ట్రీయ ఆయిల్ ఉత్పత్తి కంపెనీలు లీటరుకి పెంచమని కోరిన రూ.6.28 కంటే ఇది ఎక్కువ మొత్తం కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ క్షీణించడంతో డాలర్కు డిమాండ్ పెరిగింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.56కు చేరుకుంది. ఈ పరిణామంతో వేల కోట్ల రూపాయల నష్టం వస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు పేర్కొన్నాయి. పెట్రో ధరలపై నియంత్రణ లేకపోవడంతో ఆయా కంపెనీలు ప్రతిపాదించిన మొత్తం పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment