జెనీవాలో 50 కోట్లు పలికిన గోల్కొండ వజ్రం

జెనీవా,మే 16:  చారిత్రక ప్రాధాన్యం గల హైదరాబాద్  గోల్కొండ కు చెందిన బుయో సాన్సీ వజ్రం జెనీవా వేలం పాటలో 9.7 మిలియన్ల అమెరికా డాలర్లు పలికింది. ఇది రూ. 50 కోట్ల విలువ ఉంటుందని అంచనా. తరం నుంచి తరానికి మారుతూ ఆ వజ్రం ఐరోపా రాజవంశానికి చేరింది. 1610లో 35 క్యారట్ల ఆ వజ్రాన్ని  నాలుగో హెన్రీ సహవాసి మేరీ డీ మేడిసి ధరించారు. సోత్ బై వేలం పాటలో ఈ వజ్రాన్ని ఉంచారు. ఇది అత్యంత అరుదైన, అత్యంత సుందరమైన వజ్రమని సోత్‌బై ఇండియా డైరెక్టర్ మైథిలీ పరేఖ్ అన్నారు. గోల్కొండపరిసరాల్లోని గనుల్లోనే ఈ వజ్రం జనించి ఉంటుందని అన్నారు. హోప్, కోహినూర్, రీజెంట్ వజ్రాల స్థాయి దీనికి ఉంటుందని భావిస్తున్నారు.సోత్‌బై వేలం పాటలో ఐదుగురు ఆ వజ్రం కోసం పోటీ పడినట్లు తెలుస్తోంది. వీరు మూడు వేర్వేరు ఖండాలకు చెదినవారని తెలుస్తోంది. దాన్ని ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. అయితే, వ్యక్తి  వివరాలు  తెలియలేదు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు