Saturday, May 26, 2012

డే -2---మరో ఏడున్నర గంటలు

ఆదివారం కూడా విచారణ 
హైదరాబాద్ , మే 26:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ని  శనివారం రెండో రోజు కూడా  సిబిఐ అధికారులు ఏడున్నర గంటల పాటు ప్రశ్నించారు. సిబిఐ విచారణ ముగిసిన తర్వాత దిల్‌కుషా అతిథి గృహం నుంచి బయటకు వచ్చిన జగన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆదివారం మళ్లీ విచారణకు రమ్మన్నారని ఆయన చెప్పారు. పలు విషయాలపై వివరణలు అడిగారని, సిబిఐ వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని ఆయన అన్నారు. బై బై బై అంటూ వాహనంలో వెళ్లిపోయారు. ఆదివారం  మోపిదేవి వెంకటరమణతో కలిపి జగన్‌ను విచారించే అవకాశం ఉందని అంటున్నారు.  సోమవారం ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...