4 అసెంబ్లీ, నెల్లూరు లోక్సభ సీట్లకు అభ్యర్ధుల ప్రకటన
హైదరాబాద్, ఏప్రిల్ 29: తమ పార్టీ జాతీయ విధానంలో భాగంగానే రాష్ట్రంలో స్వతంత్రంగా పోటీ చేస్తున్నామని, తమకు ఓటేస్తే ప్రజా ఉద్యమాలకు వేసినట్టేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు చెప్పారు. వచ్చే ఉపఎన్నికల్లో 4 అసెంబ్లీ, నెల్లూరు లోక్సభ సీట్లకు పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్ధులను ఆయన ప్రకటించారు. పాయకరావుపేట నుంచి విశాఖ జిల్లా కమిటీ సభ్యుడు కె.లోకనాధం, పోలవరం నుంచి గిరిజన సంఘం నాయకుడు తెల్లం వెంకటేశ్వరరావు, తిరుపతి నుంచి కార్మిక సంఘం నాయకుడు కందారపు మురళి, అనంతపురం నుంచి వి.రాంభూపాల్రెడ్డి, నెల్లూరు లోక్సభ స్థానానికి ఆ జిల్లా పార్టీ కార్యదర్శి చండ్ర రాజగోపాల్ పోటీ చేస్తారని తెలిపారు. పరకాలలో ఎంసీపీఐ (యు)కి, ఒంగోలులో లోక్సత్తాకు మద్దతిస్తామన్నారు. తాము పోటీ చేయని మిగతా చోట్ల వామపక్షాలుంటే వారికి మద్దతిస్తామని, లేని చోట్ల ఎవరికివ్వాలనే దానిపై నామినేషన్ల ఉపసంహరణ అనంతరం నిర్ణయిస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో భావసారుప్యత కలిగిన పార్టీ ఏదీ పోటీకి రాకపోతే తామే రంగంలోకి దిగుతామన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 29: తమ పార్టీ జాతీయ విధానంలో భాగంగానే రాష్ట్రంలో స్వతంత్రంగా పోటీ చేస్తున్నామని, తమకు ఓటేస్తే ప్రజా ఉద్యమాలకు వేసినట్టేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు చెప్పారు. వచ్చే ఉపఎన్నికల్లో 4 అసెంబ్లీ, నెల్లూరు లోక్సభ సీట్లకు పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్ధులను ఆయన ప్రకటించారు. పాయకరావుపేట నుంచి విశాఖ జిల్లా కమిటీ సభ్యుడు కె.లోకనాధం, పోలవరం నుంచి గిరిజన సంఘం నాయకుడు తెల్లం వెంకటేశ్వరరావు, తిరుపతి నుంచి కార్మిక సంఘం నాయకుడు కందారపు మురళి, అనంతపురం నుంచి వి.రాంభూపాల్రెడ్డి, నెల్లూరు లోక్సభ స్థానానికి ఆ జిల్లా పార్టీ కార్యదర్శి చండ్ర రాజగోపాల్ పోటీ చేస్తారని తెలిపారు. పరకాలలో ఎంసీపీఐ (యు)కి, ఒంగోలులో లోక్సత్తాకు మద్దతిస్తామన్నారు. తాము పోటీ చేయని మిగతా చోట్ల వామపక్షాలుంటే వారికి మద్దతిస్తామని, లేని చోట్ల ఎవరికివ్వాలనే దానిపై నామినేషన్ల ఉపసంహరణ అనంతరం నిర్ణయిస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో భావసారుప్యత కలిగిన పార్టీ ఏదీ పోటీకి రాకపోతే తామే రంగంలోకి దిగుతామన్నారు.
No comments:
Post a Comment