చాలా హాపీగా ఉంది...గవర్నర్

హైదరాబాద్, ఏప్రిల్ 29: రాష్ట్రానికి రెండోసారి గవర్నర్‌గా నియమితులైన ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు ఉదయం రాజ్‌భవన్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు. డీఎస్,  మంత్రులుగీతారెడ్డి,  వట్టి వసంతకుమార్, పొన్నాల లక్ష్మయ్య, పలువురు ఎమ్మెల్యేలు కూడా నరసింహన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు మరో అవకాశం రావడం సంతోషంగా ఉందని గవర్నర్ నరసింహన్ అన్నారు. సమస్యలు ఎప్పుడూ ఉండేవేనన్న గవర్నర్ వాటిని అధిగమించినప్పుడే జీవితానికి అర్థముంటుందన్నారు. పోలీసు విభాగంలో ఉన్నప్పుడైనా... గవర్నర్‌గా విధులు నిర్వర్తించినా తనకు రెండూ సంతృప్తినిచ్చాయని తెలిపారు. అయితే దేనికదే ప్రత్యేకత కలిగినవని వెల్లడించారు. రాష్ట్రప్రజలు, ప్రభుత్వం సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు