రాజ్యసభకు సచిన్...?
న్యూఢిల్లీ,ఏప్రిల్ 26: క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్ను రాజ్యసభకు నామినేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రాజ్యసభకు సచిన్ పేరు ప్రతిపాదించాలని హోంమంత్రిత్వ శాఖకు ప్రధాని మన్మోహన్ సింగ్ లేఖ రాసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి కోటాలో సచిన్ను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. గురువారం ఉదయం సచిన్ తన భార్య అంజలితో కలిసి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. దాదాపు అరగంటసేపు ఈ భేటీ జరిగింది. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా కూడా సచిన్ వెంట ఉన్నారు. ఈ నేపథ్యంలో సచిన్ రాజ్యసభకు నామినేట్ కానున్నారని ఊహాగానాలు ఊపందుకున్నాయి.
Comments