Monday, April 2, 2012

కిరణ్, బొత్సలకు ఢిల్లీ పిలుపు

హైదరాబాద్,ఏప్రిల్ 2: : ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలకు అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. ఈ నెల నాలుగో తేదిన ఇద్దరూ ఢిల్లీ రావాలంటూ వారిని అధిష్టానం ఆదేశించింది.ఇద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు నెలకొన్న నేపథ్యంలో అధిష్టానమే రంగంలోకి దిగినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే   వీరిద్దరి  వ్యవహారం పార్టీ పెద్దలను మరింత కలవరపరుస్తోంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్  కొన్ని నియోజకవర్గాలలో మూడో స్థానానికి పరిమితమైంది. ఇందుకు తెలంగాణ సెంటిమెంట్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఉన్న సానుభూతి కారణాలు అయినప్పటికీ సిఎం, పిసిసి చీఫ్ మధ్య ఉన్న విభేదాలను తేలిగ్గా తీసివేయలేమని   పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పార్టీకి చెందిన పలువురు నేతలు ఉప ఎన్నికల ఫలితాలపై సిఎం, బొత్సలు బాధ్యత వహించారని, వారి కారణంగానే ఓడిపోయిందని తప్పు పడుతున్నారు. ఈ పరిస్థితిలో   రానున్న ఉప ఎన్నికల్లోనైనా  కొన్ని స్థానాలైనా  గెలిస్తే  పరువు దక్కుతుందని అధిష్టానం భావిస్తోంది. ఇందుకోసం పార్టీ పెద్దలు మొదట పిసిసి చీఫ్, సిఎం మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించే దిశలో వారిని ఢిల్లీకి పిలిపించుకున్నట్లుగా కనిపిస్తోంది.  ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలలో   గెలిచే అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఉప ఎన్నికల బాధ్యతను ఇరువురు తీసుకోవాలని పిసిసి చీఫ్, సిఎంకు అధిష్టానం సూచించనున్నట్లు సమాచారం 
మరోవైపు ఢిల్లీ పర్యటన సందర్భంగా బొత్స రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలిసింది. హైకమాండ్ పెద్దలను కలిసి అవసరమైతే రాజీనామా అంశాన్ని ప్రస్తావించాలని భావిస్తున్నారు. మద్యం కేసులో తనను దోషిగా చూపే కుట్ర జరుగుతున్నందున, నిర్దోషిగా తేలేంతవరకు మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రతిపాదించనున్నట్లు సమాచారం. హైకమాండ్ పెద్దలు ఒకవేళ సానుకూలంగా ఉంటే అప్పటికప్పుడే రాజీనామా చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...