Wednesday, April 4, 2012

వేటు ఎవరిపైన...?

న్యూఢిల్లీ,ఏప్రిల్ 4:   రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత యుద్ధం తారాస్థాయికి చేరిన పరిస్థితులపై కాంగ్రెస్ అధినాయకత్వం ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలోనే వారిద్దరినీ ఢిల్లీకి రావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరు అధిష్టానం ముందుకు రాకముందే పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మంగళవారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసి చర్చలు జరపటం ప్రాధాన్యత సంతరించుకుంది.. ఇటీవలి కాలంలో రెండు దఫాలుగా సోనియాను కలిసిన డీఎస్.. తాజా పరిణామాల్లో హైకమాండ్ పిలుపు మేరకు ఢిల్లీ రావటం, వచ్చిన వెంటనే సోనియాతో సమావేశం కావటం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఇటీవలి కాలంలో రెండు దఫాలుగా సోనియాను కలిసిన డీఎస్.. తాజా పరిణామాల్లో హైకమాండ్ పిలుపు మేరకు ఢిల్లీ రావటం, వచ్చిన వెంటనే సోనియాతో సమావేశం కావటం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో చేజారిన పరిస్థితులను గాడిలో పెట్టటంపై గత కొంత కాలంగా తర్జనభర్జన పడుతున్న అధిష్టానం.. ఆ విషయంలో రాష్ట్రంలోని మిగిలిన నాయకులకన్నా డీఎస్‌ను విశ్వాసంలోకి తీసుకోవటం గమనార్హం. . కాగా,  సీఎంను లేదా పీసీసీ అధ్యక్షుడిని ఎవరో ఒకరిని తప్పించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, వారిద్దరి మధ్య సయోధ్య కుదిరే పనికాదన్న నిర్ధారణకు అధిష్టానం వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ ప్రభావం కూడా ఉన్న నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవలసి ఉంది. మరోఐపు కిరణ్‌ను తప్పించి ముఖ్యమంత్రి పీఠాన్ని డీఎస్‌కు అప్పగించే అవకాశాలున్నాయని గత కొద్ది రోజులుగా బాగా ప్రచారం జరుగుతోంది. కిరణ్‌ను తప్పించాలన్న డిమాండ్‌తో రాష్ట్రానికి చెందిన పలువురు నాయకులు ఇప్పటికే ఢిల్లీ చేరుకుని తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొత్స కూడా ఈ విషయంలో ఇప్పటికే అధిష్టానానికి పలు నివేదికలు పంపించటమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఆయన డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో పాటు పలువురు మంత్రుల మద్దతు కూడగట్టినట్లు సమాచారం. అయితే మద్యం సిండికేట్ వ్యవహారంలో బొత్స పాత్రపై ముఖ్యమంత్రి అత్యంత కీలకమైన పలు అంశాలను హైకమాండ్ ముందు ఉంచినట్లు చెప్తున్నారు. ఈ దృష్ట్యా బొత్స నే తప్పించవచ్చనే  ప్రచారం కూడా ఉంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...