కోల్ కతా,ఏప్రిల్ 10: దేశంలో బ్రాడ్బ్యాండ్ విప్లవానికి భారతీ ఎయిర్టెల్ శ్రీకారం చుట్టింది. 4జీ సర్వీసులను ఈ సంస్థ మంగళవారం కోల్కతాలో ప్రారంభించింది. బ్రాడ్బ్యాండ్ ద్వారా మొబైల్ వీడియో అత్యంత సులభతరమవుతుంది. సెల్ఫోన్లో టీవీ ఛానెళ్లను ఇంట్లో ఉన్న టీవీలో చూసినట్లు చూడొచ్చు. కంపెనీలు ప్రధాన కార్యాలయాల నుంచే ఫ్యాక్టరీల్లో సమస్యల్ని పరిష్కరించవచ్చు. వైద్య రంగంలోనూ దూర ప్రాంతం నుంచి రోగులకు చికిత్స అందించవచ్చు. ఇప్పటి వరకు ఈ సేవల్ని 2జీ, 3జీ సర్వీసుల ద్వారా అందిస్తున్నారు. అయితే 4జీ రాక వల్ల ఈ సేవల్లో వేగం, నాణ్యత పెరుగుతాయి. అమెరికాలోని టెలికాం కంపెనీలు ఇప్పటికే 4జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చాయి. మన దేశంలో భారతీ ఎయిర్టెల్ తొలిసారిగా 4జీ సర్వీసుల్ని ప్రారంభించింది. అందుబాటు ధరల్లో 4జీ సేవల్ని వినియోగదారులకు అందించాలన్నది తమ లక్ష్యమని ఈ కంపెనీ ఛైర్మన్ సునీల్ మిట్టల్ తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment