థాయ్‌లాండ్‌లో బాంబు పేలుళ్లు; 14 మంది మృతి

హట్‌యాయి,ఏప్రిల్ 1:   దక్షిణ థాయ్‌లాండ్‌లో ముస్లిం చొరబాటుదారులు శనివారం జరిపిన బాంబు దాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య 14కు చేరుకుంది. 340 మంది గాయపడ్డారు. యల నగరంలో రెస్టారెంట్లు, దుకాణాలతో కిటకిటలాడే ఓ ప్రాంతంలో బాంబులతో నింపిన ట్రక్కుతో ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. 20 నిమిషాల తర్వాత ఘటనా స్థలం వద్ద ప్రజలు గుమిగూడినప్పుడు మరో కారు బాంబు పేలింది. ఈ విస్ఫోటనంతో ఎక్కువగా ప్రాణ నష్టం సంభవించింది. దక్షిణ ప్రావిన్స్ లోని నరాటివాత్, పటాని, యల ప్రాంతాల్లో 2004 నుంచి ఇప్పటివరకు ఐదు వేల మందికి పైగా అమాయకులను ముస్లిం చొరబాటుదారులు బలితీసుకున్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు