హైదరాబాద్,మార్చి 25: తెలంగాణ సమస్య పరిష్కారానికి ఆత్మహత్యలు పరిష్కారం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణపై కేంద్రం సరైన సమయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. యువత ఆవేశానికి, ఉద్వేగానికి లోనై తమ బంగారు భవిష్యత్తును కోల్పోవద్దని సూచించారు. బోజ్యా నాయక్ మృతి పట్ల సిఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బోజ్యా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నేతల ఇళ్లపై ఆందోళనకారుల దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రజల మనోభావాలు కేంద్రానికి తెలుసునని చెప్పారు.
భావోద్వేగాలకు లోను కావొద్దు- చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా బోజ్యా నాయక్ మృతి పట్ల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. యువకులు భావోద్వేగాలకు లోను కావొద్దని చంద్రబాబు సూచించారు. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
భావోద్వేగాలకు లోను కావొద్దు- చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా బోజ్యా నాయక్ మృతి పట్ల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. యువకులు భావోద్వేగాలకు లోను కావొద్దని చంద్రబాబు సూచించారు. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
No comments:
Post a Comment