రాష్ట్రంలో అయిదు ఆదర్శ రైల్వే స్టేషన్లు

న్యూఢిల్లీ,మార్చి 14: కొత్త రైల్వే బడ్జెట్ లో మన రాష్ట్రంలో అయిదు రైల్వేస్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా ప్రకటించారు. దువ్వాడ, వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి రైల్వే స్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా పేర్కొన్నారు. హైదరాబాద్ ఎంఎంటిసి రెండవదశకు అనుమతించారు..  కోరుకొండ - విజయనగరం డబ్లింగ్ పనులను పూర్తి చేయాలని నిర్ణయించారు. మన రాష్ట్రంలో కొన్ని కొత్త రైలు మార్గాలను ప్రతిపాదించారు. కోటిపల్లి - నర్సాపూర్, కడప - బెంగళూరు, నడికుడి - శ్రీకాళహస్తి, విజయవాడ - గుడివాడ రైలు మార్గాలను ప్రతిపాదించారు. బీబీనగర్ - నల్లపాడు రైలు మార్గాన్ని విద్యుద్దీకరించాలని ప్రతిపాదించారు. కొన్ని మార్గాలను రైల్వే లైన్ సర్వే కోసం ఎంపిక చేశారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు