Friday, March 23, 2012

విడాకులు ఇక సులభతరం

న్యూఢిల్లీ,మార్చి 23: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7 శాతం డీఏ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు జరిగిన కేంద్ర కేబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన డీఏ జనవరి నుంచి అమల్లోకి వస్తుంది. . భోపాల్ ప్రమాద బాధితులకు 1500 కోట్లు రూపాయల్ని ప్రభుత్వం ఇవ్వనుంది. బాధితల ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలను అందించనున్నారు. అంతేకాక హిందూ వివాహ చట్టంలో కీలక మార్పులు తీసుకువచ్చారు.  వివాహ చట్టంలో విడాకులు ఇక సులభతరం కానున్నాయి. విడాకులు పొందే సమయానికి భర్త సంపాదించిన ఆస్తిలో వాటా భార్యకు దక్కనుంది. దత్తత తీసుకున్న పిల్లలకు కూడా సమానమైన హక్కులు ఉంటాయి. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...