శారదకు ఎన్టీఆర్,బాలయ్యకు రఘుపతి వెంకయ్య అవార్డులు...
హైదరాబాద్,మార్చి 20: 2010 సంవత్సరానికి సంబంధించి మూడు జాతీయ, ఒక రాష్ట్రీయ చలనచిత్ర అవార్డుల విజేతలను జి.ఆదిశేషగిరిరావు నేతృత్వంలోని జ్యూరీ ప్రకటించిందిప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ జాతీయ చలన చిత్ర అవార్డుకు సినీ నటి శారద ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద రూ.5 లక్షల నగదు పారితోషికంతోపాటు ప్రత్యేక జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని ప్రదానం చేస్తారు. బీఎన్ రెడ్డి జాతీయ చలనచిత్ర అవార్డుకు మా భూమి దర్శకుడు బి.నర్సింగరావు ఎంపికయ్యారు. నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డుకు నిర్మాత ఏవీఎం శరవణన్ బాలసుబ్రహ్మణ్యన్ ఎంపికయ్యారు. రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డును నటుడు, నిర్మాత, దర్శకుడు ఎం.బాలయ్య కు లభించింది. ఈ అవార్డుల విజేతలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల నగదు బహుమతితోపాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేస్తారు. ప్రత్యేక జ్యూరీ అవార్డుకు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఎంపికయ్యారు.

Comments