శారదకు ఎన్టీఆర్,బాలయ్యకు రఘుపతి వెంకయ్య అవార్డులు...

హైదరాబాద్,మార్చి 20:   2010 సంవత్సరానికి సంబంధించి మూడు జాతీయ, ఒక రాష్ట్రీయ చలనచిత్ర అవార్డుల విజేతలను  జి.ఆదిశేషగిరిరావు నేతృత్వంలోని జ్యూరీ  ప్రకటించిందిప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ జాతీయ చలన చిత్ర అవార్డుకు సినీ నటి శారద ఎంపికయ్యారు. ఈ  అవార్డు కింద రూ.5 లక్షల నగదు పారితోషికంతోపాటు ప్రత్యేక జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని ప్రదానం చేస్తారు. బీఎన్ రెడ్డి జాతీయ చలనచిత్ర అవార్డుకు మా భూమి దర్శకుడు బి.నర్సింగరావు ఎంపికయ్యారు. నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డుకు నిర్మాత ఏవీఎం శరవణన్ బాలసుబ్రహ్మణ్యన్ ఎంపికయ్యారు. రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డును నటుడు, నిర్మాత, దర్శకుడు ఎం.బాలయ్య కు లభించింది. ఈ అవార్డుల విజేతలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల నగదు బహుమతితోపాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేస్తారు. ప్రత్యేక జ్యూరీ అవార్డుకు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఎంపికయ్యారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు