హైదరాబాద్,మార్చి 20: 2010 సంవత్సరానికి సంబంధించి మూడు జాతీయ, ఒక రాష్ట్రీయ చలనచిత్ర అవార్డుల విజేతలను జి.ఆదిశేషగిరిరావు నేతృత్వంలోని జ్యూరీ ప్రకటించిందిప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ జాతీయ చలన చిత్ర అవార్డుకు సినీ నటి శారద ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద రూ.5 లక్షల నగదు పారితోషికంతోపాటు ప్రత్యేక జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని ప్రదానం చేస్తారు. బీఎన్ రెడ్డి జాతీయ చలనచిత్ర అవార్డుకు మా భూమి దర్శకుడు బి.నర్సింగరావు ఎంపికయ్యారు. నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డుకు నిర్మాత ఏవీఎం శరవణన్ బాలసుబ్రహ్మణ్యన్ ఎంపికయ్యారు. రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డును నటుడు, నిర్మాత, దర్శకుడు ఎం.బాలయ్య కు లభించింది. ఈ అవార్డుల విజేతలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల నగదు బహుమతితోపాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేస్తారు. ప్రత్యేక జ్యూరీ అవార్డుకు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఎంపికయ్యారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment