Friday, March 16, 2012

మమత తో కటీఫ్ కు కాంగ్రెస్ యోచన ?

సమాజ్‌వాదీపార్టీ వైపు చూపు

న్యూఢిల్లీ,మార్చి 15:  చీటికీ మాటికీ చిక్కులు తెచ్చి పెడుతున్న తృణమూల్ కాంగ్రెసు అధ్యక్షురాలు మమతా బెనర్జీని వదిలించుకుని, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌తో జత కట్టాలని కాంగ్రెసు నాయకత్వం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా, రైల్వే మంత్రి దినేష్ త్రివేది రాజీనామా వ్యవహారాన్ని ఆసరా చేసుకుని తృణమూల్ కాంగ్రెసుతో తెగదెంపులు చేసుకోవాలని  అందుకు బదులుగా  ములాయం సింగ్‌ నేతృత్వం లోని సమాజ్ వాదీ తో జతగట్టాలని  కాంగ్రెసు భావిస్తున్నట్టు సమాచారం. ఎస్పీకి లోకసభలో 22 మంది సభ్యులున్నారు. కేంద్ర మంత్రివర్గంలో చేరాలని కాంగ్రెసు నాయకులు ములాయం సింగ్‌ను ఆహ్వానిస్తున్నారు. తృణమూల్, కాంగ్రెసు మధ్య అవిశ్వాసం నెలకొనడం ఇదే మొదటి సారి కాదు. ఇప్పటికే పలు సార్లు మమతా బెనర్జీ కాంగ్రెసుకు హెచ్చరికలు ఇచ్చారు. త్రివేదిని మంత్రి వర్గం నుంచి తొలగించి, ఆ స్థానంలో ముకుల్ రాయ్‌ని నియమించాలని కోరుతూ మమతా బెనర్జీ బుధవారంనాడు లేఖ రాశారు. మమతా బెనర్జీ విజ్ఞప్తిని అంగీకరించినట్లు మొదట సూచనలు ఇచ్చిన కాంగ్రెసు నాయకత్వం ఆ తర్వాత మొత్తం సీన్‌ను మార్చేసింది. త్రివేది రాజీనామా చేయలేదని ప్రభుత్వం ప్రకటించింది. దినేష్ త్రివేదిని తప్పించుకుండా మమతా బెనర్జీకి షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెసు నాయకత్వం ఉన్నట్లు అర్థమవుతోంది. అందుకే మమతా బెనర్జీ కాంగ్రెసుపై మండిపడుతున్నారు.  తమ పార్టీ యుపిఎ నుంచి వైదొలగదని, యుపిఎ చెక్కు చెదరదని తృణమూల్ కాంగ్రెసు పార్టీ నాయకుడు సుదీప్ బంధోపాధ్యాయ చెప్పారున. కానీ, మమతా బెనర్జీ తలనొప్పిని వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెసు నాయకత్వం నాటకాన్ని రక్తి కట్టిస్తోందని అంటున్నారు.  మరో వైపు యుపిఎకు మద్దతిచ్చే విషయంపై ములాయం సింగ్ చూసుకుంటారని ఉత్తరవ్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...