Wednesday, March 7, 2012

యు.పి. ని ప్రగతి బాట పట్టిస్తాం: అఖిలేష్ యాదవ్

లక్నో,మార్చి 6:    ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) రాష్ట్ర విభాగం అధ్యక్షుడు, ములాయం కుమారుడు  అఖిలేష్ యాదవ్ తెలిపారు. ముస్లింల అభ్యున్నతి కోసం సచార్, రంగనాథ్ మిశ్రా కమిటీలు చేసిన సిఫార్సులను కూడా అమలు చేస్తామని చెప్పారు. కుల మతాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఎస్పీకి మద్దతిచ్చారని, తమ పార్టీ ఎన్నికల్లో ప్రస్తావించిన అంశాలను జనం అంగీకరించినట్టు దీన్నిబట్టి స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనమున్న అంశాలపై వీధుల్లోకి వచ్చి పోరాడిన ఏకైక పార్టీ ఎస్పీయేనన్నారు. వెనుకబడిన యూపీని తమ పాలనలో అభివృద్ధి బాట పట్టిస్తామని, రాష్ట్రంలో అవినీతి రహిత వాతావరణాన్ని నెలకొల్పుతామని అఖిలేష్ హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక మాయావతి విగ్రహాలను, బీఎ స్పీ చిహ్నమైన ఏనుగు విగ్రహాలను కూల్చబోమని అఖిలేష్ స్పష్టం చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...