3 రోజులు నగల వ్యాపారం బంద్‌

న్యూఢిల్లీ, మార్చి 17:  బ్రాండెడ్‌ బంగారం ,వెండి దిగుమతులపై కస్టంస్ డ్యూటీ పెంచడంపై దేశవ్యాప్తంగా బంగారం వర్తకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.  17,18,19 తేదీలలో 3 రోజులు నగల వ్యాపారం బంద్‌ చేస్తున్నట్లు అఖిల భారతీయ రత్నాలు,ఆభరణాల వాణిజ్య సమాఖ్య ప్రకటించింది. జంటనగరాల్లో బంగారం వర్తకులు ఈ బంద్‌కు  మద్ధతు తెలిపారు. మూడు రోజుల పాటు నగల దుకాణాలు మూసివేయాలని నిర్ణయించారు. 1962-92 మధ్య కాలంలో కూడా ఇలాగే చేయడం వలన పరిశ్రమ కుదేలైందని, దీంతో ఆభరణాల దుకాణాలను మూసివేయాల్సిన పరిస్ధితి ఏర్పడిందని , ఇప్పటికే పెరిగిన బంగారం ధరతో సతమతమౌతున్న తమకు పన్ను పోటునుంచి ఊరట కలిగించాలని జ్యూయెలరీ  అసోసియేషన్ లు విజ్ఞప్తి చేస్తున్నాయి.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు