అల్లరి అసెంబ్లీ ప్రారంభం

హైదరాబాద్,ఫిబ్రవరి 14: గవర్నర్ నరసింహన్ సోమవారం అసెంబ్లీలో త్వరత్వరగా  తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే  గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగం ప్రారంభించారు. అయితే విపక్షాలతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు నినాదాలు చేశారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను ఎమ్మెల్యేలు చించి గవర్నర్ వైపు విసిరారు. తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలేందుకు ప్రయత్నించారు. దీంతో గవర్నర్ తన ప్రసంగాన్ని జెట్ స్పీడ్‌తో చదవడం ప్రారంభించారు. హడావుడిగా గవర్నర్ ప్రసంగం చదవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాసేపటికి విపక్షాల నినాదాలు చల్లబడటంతో ఆయన కూడా తన ప్రసంగంలో వేగం తగ్గించారు.  బలహీనవర్గాల కోసం ప్రభుత్వం ఎన్నో చేసిందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ, మతపరమైన పరిస్థితులు  అదుపులో ఉన్నాయన్నారు.వామపక్ష తీవ్రవాదం ఎదుర్కొనేందుకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టామని చెప్పారు.      

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు