Friday, February 24, 2012

శ్రీలంక సంచలన విజయం

హొబర్ట్,ఫిబ్రవరి 24:  ముక్కోణపు క్రికెట్ పోటీలో ఆస్ట్రేలియాపై మూడు వికెట్ల తేడాతో శ్రీలంక జట్టు సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా  నిర్ణీత 50 ఓవర్లలో  6 వికెట్లు నష్టపోయి 280 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 49.2 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 283 పరుగులు చేసింది. శ్రీలంక జట్టులో జయవర్ధనే 85 పరుగులు, చంఢీమాల్ 80 పరుగులు చేశారు. క్రిస్టియన్ మూడు వికెట్లు, హిల్ఫెన్ హాస్ రెండు, హారిస్, డోహెర్టీలు ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ సిరీస్ లో  ప్రస్తుతం శ్రీలంక 15 పాయింట్లు, ఆస్ట్రేలియా 14, భారత్ 10 పాయింట్లతో ఉన్నాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...