సాగని సభ...
హైదరాబాద్,ఫిబ్రవరి 27: మద్యం మాఫియాపై సంపూర్ణ చర్చ జరగాలంటూ టీడీపీ పట్టుబడడంతో అసెంబ్లీ సోమవారం ఎటువంటి కార్యక్రమం చేపట్టకుండానే మంగళవారానికి వాయిదా పడింది. ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే మద్యం సిండికేట్ల పై చర్చ కొనసాగించాలంటూ టీడీపీ సభా కార్యక్రమాలను అడ్డుకుంది. దీంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ రెండుసార్లు సభను అరగంట పాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో టీడీపీ మళ్లీ అదే తీరును ప్రదర్శించింది. బడ్జెట్పై చర్చను ప్రారంభించేందుకు ద్రోణంరాజు శ్రీనివాస్ రెండుసార్లు ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోవడంతో డిప్యూటీ స్పీకర్ భట్టీ విక్రమార్క సభను మంగళవారానికి వాయిదా వేశారు.
Comments