Tuesday, February 28, 2012

హమ్మయ్య...ఎట్టకేలకు...ఓ గెలుపు...ఫైనల్ ఆశలు సజీవం

హోబర్ట్,ఫిబ్రవరి 28: : ముక్కోణపు టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన కీలక వన్డే మ్యాచ్‌లో ఇండియా 36.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఈ టూర్‌లో ఇండియా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఈరోజు లంకపై విజయం సాధించి, ఫైనల్‌కు ఆశలు సజీవంగా ఉంచుకోవడంతో భారత క్రీడాభిమానులలో  సంతోషం వెల్లివిరిసింది. భారత్ 36.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. విరాట్ కోహ్లీ 88 బంతులలో 133 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, గౌతమ్ గంభీర్ 63, సచిన్ : 39, సెహ్వాగ్ : 30 పరుగులు చేశారు. మలింగ వేసిన ఓవర్లో మొదటి బంతికి రెండు పరుగులతో సెంచరీని పూర్తిచేసిన విరాట్ కోహ్లీ.. ఆకాశమే హద్దుగా చెలరేగి అదే ఓవర్లో ఓ సిక్స్, నాలుగు ఫోర్లతో మొత్తం 24 పరుగులు చేసి భారత్‌కు బోనస్ పాయింట్ దక్కడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా టీమిండియాకు శ్రీలంకపై అలవోక విజయాన్ని అందించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. కాగా  తొలుత టీంఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో  బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసి 321 పరుగుల విజయలక్ష్యాన్ని ఇండియా ముందుంచింది. మ్యాచ్ ప్రారంభం నుంచి నిలకడగా ఆడిన శ్రీలంక భారీ స్కోర్ చేసింది. దిల్షాన్ (160-నాటౌట్),  ,సంగక్కర (105) పరుగుల వర్షం కురిపించి ఇండియా బౌలర్లను హడలెత్తించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...