హైదరాబాద్ , ఫిబ్రవరి 21: మద్యం సిండికేట్ల వ్యవహారంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఎసిబి అదుపులో ఉన్న ఎన్. రమణ --కీలక సమాచారం అందించినట్టు తెలుస్తోంది. మంత్రి తన ఇంట్లోనే రెండు గ్రూపుల తగాదాలు పరిష్కరించారని, ఆ రెండు గ్రూపుల మధ్య రాజీ కుదిర్చి మంత్రి మోపిదేవి పది లక్షల రూపాయలు తీసుకున్నారని రమణ తెలిపినట్టు సమాచారం. రమణ నేరాంగీకార పత్రంలో పేర్కొన్న విషయాలపై ఎసిబి అధికారులు దృష్టిసారించారు. మరో 14 మంది మద్యం వ్యాపారులను కూడా అధికారులు ప్రశ్నించారు.
మోపిదేవి ఆవేదన
తనకు సంబంధంలేని విషయాలలో తనని ఇరికిస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో తన ప్రస్తావన పదేపదే రావడం బాధిస్తోందన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రిని నిలదీసినట్లు ఆయన చెప్పారు. సిండికేట్లపై శాసనసభలో మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎసిబి ఒక వైపే పని చేస్తుందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. సిండికేట్ల వ్యవహారంలో తన ప్రమేయం ఉందని తేలితే మరుక్షణం రాజీనామా చేస్తానని మంత్రి చెప్పారు. రాజీనామా లేఖ తన జేబులోనే ఉన్నట్లు ఆయన తెలిపారు.
మోపిదేవి ఆవేదన
తనకు సంబంధంలేని విషయాలలో తనని ఇరికిస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో తన ప్రస్తావన పదేపదే రావడం బాధిస్తోందన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రిని నిలదీసినట్లు ఆయన చెప్పారు. సిండికేట్లపై శాసనసభలో మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎసిబి ఒక వైపే పని చేస్తుందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. సిండికేట్ల వ్యవహారంలో తన ప్రమేయం ఉందని తేలితే మరుక్షణం రాజీనామా చేస్తానని మంత్రి చెప్పారు. రాజీనామా లేఖ తన జేబులోనే ఉన్నట్లు ఆయన తెలిపారు.
No comments:
Post a Comment