లండన్,ఫిబ్రవరి 24: లండన్ మేయర్ ఎన్నికల రేసులో భారత సంతతికి చెందిన స్వతంత్ర అభ్యర్థి సియోబాన్ బెనీటా (40) కన్సర్వేటివ్ , లేబర్ పార్టీ అభ్యర్ధులకు గట్టి పోటీ ఇస్తున్నారు. . ప్రచారంలో తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న ఆమెకు గత ప్రభుత్వాల్లో పనిచేసిన పలువురు ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తుండడం విశేషం . వచ్చే మే నెల 3న జరిగే ఎన్నికల్లో పాల్గొనే నిమిత్తం ఆమె ప్రజా సేవల విభాగంలో తన పదవికి కూడా ఇటీవలే రాజీనామా చేశారు. భారత సంతతికి చెందిన తల్లి, కార్నిష్ తండ్రికి జన్మించిన బెనీటా.. 1996లో సివిల్ సర్వీసెస్లో చేరి ప్రజాసేవలో భాగమయ్యారు. లండన్లోనే పుట్టి పెరిగిన బెనీటా.. ప్రస్తుతం తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి కింగ్స్టన్ ప్రాంతంలో నివసిస్తున్నారు. వార్విక్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్, జర్మన్లను అభ్యసించిన ఆమె ప్రజా సేవలోనూ ప్రశంసలు పొందారు.ఇప్పుడు పదవికి రాజీనామా చేసి ‘మరింత మెరుగైన లండన్’ నినాదంతో ప్రస్తుత మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ప్రచారం నిమిత్తం రూపొందించిన వెబ్సైట్లో తన తల్లి భారత్ నుంచి 1956లో ఓ యువతిగా ఉన్నప్పుడు లండన్కు వచ్చిన విషయాన్ని ప్రస్తావించి భారత సంతతికి చెందిన వారిని ఆకర్షిస్తున్నారు. స్వతంత్ర మేయర్ ద్వారానే లండన్ మరింత సమగ్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ఆమె లండన్వాసులకు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు గతంలో పలువురు ప్రధాన మంత్రుల హయాంలో పనిచేసిన లార్డ్ ఒ డానెల్ మద్దతు ఇస్తుండడం విశేషం.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment