హైదరాబాద్,పిబ్రవరి 15: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్ రైల్వేకాలనీకి చెందిన పులి రాజేశ్ (25) మృతిచెందాడు. టెక్సాస్ రాష్ట్రంలోని డొనాలస్లో ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయంలో రాజేశ్ ఎం.ఎస్. సెకండియర్ చేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం జోరుగా కురుస్తున్న వర్షంలో రాజేశ్ స్వయంగా నడుపుతున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ రాజేశ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్నేహితులు హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. అప్పటికే పరిస్థితి విషమించడంలో మంగళవారం అర్ధరాత్రి రాజేశ్ మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పులి వెంకటేష్-కస్తూరి దంపతులకు రాజేశ్ ఒక్కడే కుమారుడు. మరో కుమార్తె ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment