న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆరోగ్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లారు. ఆర్నెల్ల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్న ఆమె సాధారణ ఆరోగ్య పరీక్షల కోసమే అమెరికా వెళ్లారని, నాలుగైదు రోజుల తర్వాత తిరిగివస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి, మీడియా విభాగం చైర్మన్ జనార్ధన్ ద్వివేది వెల్లడించారు. 65 ఏళ్ల సోనియాకు గత ఆగస్టులో అమెరికాలో శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆమె దాదాపు ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకుని పూర్తిగా కోలుకున్న తర్వాత ప్రజల మధ్యకు వచ్చారు. కాగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు బహిరంగ సభల్లో ప్రసంగించిన సోనియా.. మొన్న ఆదివారం కూడా యూపీలోని సహరాన్పూర్లో ర్యాలీలో పాల్గొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్న మార్చి 6 నాటికి సోనియా ఢిల్లీకి తిరిగివస్తారని ఏఐసీసీలోని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. కాగా, శస్త్రచికిత్స నిమిత్తం గత ఏడాది అమెరికా వెళ్లిన సమయంలో సోనియా పార్టీ వ్యవహారాల పర్యవేక్షణకు తనయుడు రాహుల్గాంధీ సహా నలుగురు సభ్యులతో కమిటీ వేసిన విషయం విదితమే. అయితే ఇప్పుడు ఎలాంటి కమిటీని నియమించలేదు.ఇప్పటికిప్పుడు అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలు లేనందున, ఆమె ఎలాగూ వారంలోపే తిరిగివస్తున్నందున కొత్తగా కమిటీ వేయాల్సిన అవసరం లేదని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment