Wednesday, February 29, 2012

ఆసియా కప్ కు భారత జట్టు ఖరారు

ముంబై,ఫిబ్రవరి 29:  బంగ్లాదేశ్‌లోని మీర్పూర్‌లో మార్చి 11 తేది నుంచి ఆరంభమయ్యే ఆసియా కప్ కోసం 15 మంది సభ్యుల భారత్ జట్టును జాతీయ సెలెక్టర్లు  ప్రకటించారు. వీరేంద్ర సెహ్వాగ్, ఉమేష్ యాదవ్, జహీర్ ఖాన్‌లకు విశ్రాంతి కల్పించారు. ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా విఫలమైన రోహిత్, రవీంద్ర జడేజాలను జట్టులోకి తీసుకున్నారు. చెప్పుకోదగ్గ మార్పులు లేకుండానే జట్టును ఎంపిక చేశారు. సచిన్ జట్టులోకి తీసుకోవడం, విరాట్ కోహ్లీకి వె స్ కెప్టెన్ బాధ్యతల్ని అప్పగించడం విశేషం. బెంగాల్ బౌలర్ అశోక్ దిండా, యూసఫ్ పఠాన్‌లను జట్టులోకి తీసుకున్నారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, శ్రీలంకలతోపాటు భారత జట్టు ముక్కోణపు టోర్నిలో ఆడనుంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...