హైదరాబాద్,ఫిబ్రవరి 28: ఐదు రాష్ట్రాల శానససభ ఎన్నికలు పూర్తి కాగానే తెలంగాణ సమస్యపై కాంగ్రెసు అధిష్టానం దృష్టి సారించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.తెలంగాణ సమస్య పరిష్కారానికి ప్రాంతీయ బోర్డు ఏర్పాటే పరిష్కారంగా కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. ప్రాంతీయ మండలి ఏర్పాటుతో పాటు రూ.15 - 20 వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ కూడా ఉంటుందని అంటున్నారు. ప్రత్యేక మండలి స్వరూప స్వభావాలపై ఇప్పటికే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ హిల్ కౌన్సిల్ తరహా పరిష్కార మార్గాన్నే తెలంగాణకు వర్తింపజేయాలనే ఆలోచన సాగుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, సీమాంధ్ర నాయకులతో పలు మార్లు చర్చలు జరిపిన కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ సోనియాకు ఓ నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది. రాజ్యాంగ, చట్టబద్ద హక్కులతో తెలంగాణకు ప్రత్యేక మండలి ప్రకటిస్తూ భారీ ఆర్థిక ప్యాకేజీ ఇవ్వడమే మంచిదని ఆయన అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. కాగా, ప్యాకేజీలు, ప్రత్యేక మండళ్లు తెలంగాణ ప్రజలు ఒప్పుకోరని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. ఎలాంటి ప్యాకేజీలను తాము ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. తమకు తెలంగాణ రాష్ట్రం తప్ప ఏదీ వద్దన్నారు. మండలి అంటే తెలంగాణలో కాంగ్రెసు పార్టీ శాశ్వతంగా ప్రజలకు దూరమవుతుందని హెచ్చరించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment