Wednesday, February 22, 2012

స్టేట్ యునైట్...పార్టీలే సెపరేట్...!

ఉప ఎన్నికల ' సిత్రం '  
హైదరాబాద్,ఫిబ్రవరి 22:  మార్చి 18వ తేదీన తెలంగాణలోని ఆరు స్థానాలకు, ఆంధ్రలోని ఓ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల నేపధ్యంలో  రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు  మారే సూచనలు కనిపిస్తున్నాయి.   అధికార కాంగ్రెసు పార్టీ మిత్రులెవరూ లేకుండా  ఉప ఎన్నికల బరిలోకి దిగుతోంది. మరోవైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కి సిపిఎంతో బెడిసింది.  సిపిఐ మాత్రం తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే అవకాశాలున్నా సిపిఎం పోటీ చేసే స్థానాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి సిపిఐ మద్దతు దొరికే చాన్స్ లేనట్టే.  ఇక తెలంగాణ ఉద్యమం సమయంలో చెట్టపట్టాలు వేసుకు తిరిగిన తెరాస, బిజెపి మధ్య కూడా  దూరం పెరిగింది. మొదట రెండు స్థానాలకు మాత్రమే పోటీ చేయాలని భావించిన బిజెపి ఇప్పుడు  అన్ని స్థానాలకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు కనబడుతోంది.  తొలుత మహబూబ్‌నగర్, కోస్తాంధ్రలోని కోవూరు స్థానాలకు మాత్రమే పోటీ చేయాలనుకున్న బిజెపి మొత్తం స్థానాలకు పోటీ  చేస్తే కొంత మేరకు తెలంగాణ సెంటిమెంటుకు సంబంధించిన ఓట్లు చీలడం ఖాయమని వేరే చెప్పక్కరలేదు.   ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితులు కెసిఆర్‌ కు సంకటం గానే ఉన్నాయి. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలే గాక అనుకూలంగా ఉన్న పార్టీలు కూడా అయనకు కలసి వచ్చే వాతావరణం కంపించడం లేదు.  ఈ ఉప ఎన్నీలలో తెలంగాణ సెంటిమెంటు ను మరోసారి చాటి చెప్పాలనుకుంటున్న టి. ఆర్.ఎస్., అభివృద్ధి మంత్రం తో కాంగ్రెస్, కాంగ్రెసు, తెరాసలను ఎండగట్టే లక్ష్యం తో తెలుగుదేశం, ఒక్క కోవూరు స్థానం నుంచి పోటితో రాజకీయ ఉనికిని కాపాడుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు  హోరాహోరీ తలపడుతున్న ఈ ఉప ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ  నెలకొంది.   


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...