జోహనెస్బర్గ్, ఫిబ్రవరి 25: వర్ణ వివక్షపై అలుపెరుగని పోరాటం చేసిన ‘నల్ల సూరీడు’, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత నెల్సన్ మండేలా ఆరోగ్యం విషమించింది. గత కొద్దికాలంగా ఉదర సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మండేలాకు ప్రత్యేక చికిత్స అవసరమని వైద్యులు వెల్లడించారు. 93 ఏళ్ల నెల్సన్ దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షపై పోరాటం జరిపి 27 సంవత్సరాల సుదీర్ఘ కాలం జైలు జీవితాన్ని గడిపారు. 1990 సంవత్సరంలో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. 1993లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1994 సంవత్సరంలో తొలి నల్ల జాతీయుడిగా దక్షిణాఫ్రికా అధ్యక్ష పదవిని మండేలా చేపట్టారు.
కాగా మండేలాకు శనివారం నాడు హెర్నియా ఆపరేషన్ చేసినట్టు సమాచారం. ఆయన రెండు రోజులలో డిస్ చార్జి అవుతారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మండేలా అరోగ్యం పై ఆందోళన వద్దని దేశాధ్యక్షుడు జాకొబ్ జుమా తెలిపారు.
కాగా మండేలాకు శనివారం నాడు హెర్నియా ఆపరేషన్ చేసినట్టు సమాచారం. ఆయన రెండు రోజులలో డిస్ చార్జి అవుతారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మండేలా అరోగ్యం పై ఆందోళన వద్దని దేశాధ్యక్షుడు జాకొబ్ జుమా తెలిపారు.
No comments:
Post a Comment