ఫైల్ తిప్పి పంపిన గవర్నర్...
హైదరాబాద్ , ఫిబ్రవరి 21: సమాచార హక్కు కమిషనర్ల నియామక ఫైల్ ని గవర్నర్ నరసింహన్ ప్రభుత్వానికి తిప్పిపంపారు. ఎనిమిది మంది కమిషనర్ల నియామకంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అనుభవంలేనివారిని నియమించారని ఆరోపణలు వచ్చాయి. ఎంపిక ప్రక్రియ రాజకీయవేదికగా మారిందని ఫిర్యాదులు వచ్చాయి. ఈ పరిస్థితులలో సమాచార కమిషనర్ల ఎంపికని మరోసారి పరిశీలించాలని గవర్నర్ ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం. రాజకీయ చరిత్ర కలిగిన నలుగురి పేర్లను గవర్నర్ తిరస్కరించినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ , ఫిబ్రవరి 21: సమాచార హక్కు కమిషనర్ల నియామక ఫైల్ ని గవర్నర్ నరసింహన్ ప్రభుత్వానికి తిప్పిపంపారు. ఎనిమిది మంది కమిషనర్ల నియామకంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అనుభవంలేనివారిని నియమించారని ఆరోపణలు వచ్చాయి. ఎంపిక ప్రక్రియ రాజకీయవేదికగా మారిందని ఫిర్యాదులు వచ్చాయి. ఈ పరిస్థితులలో సమాచార కమిషనర్ల ఎంపికని మరోసారి పరిశీలించాలని గవర్నర్ ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం. రాజకీయ చరిత్ర కలిగిన నలుగురి పేర్లను గవర్నర్ తిరస్కరించినట్టు తెలుస్తోంది.
No comments:
Post a Comment