Tuesday, February 21, 2012

సమాచార కమిషనర్ల ఎంపిక పై వివాదం

ఫైల్ తిప్పి పంపిన గవర్నర్... 
హైదరాబాద్ , ఫిబ్రవరి 21:    సమాచార హక్కు కమిషనర్ల నియామక ఫైల్ ని గవర్నర్ నరసింహన్ ప్రభుత్వానికి తిప్పిపంపారు. ఎనిమిది  మంది కమిషనర్ల నియామకంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అనుభవంలేనివారిని నియమించారని ఆరోపణలు వచ్చాయి. ఎంపిక ప్రక్రియ రాజకీయవేదికగా మారిందని ఫిర్యాదులు వచ్చాయి. ఈ పరిస్థితులలో సమాచార కమిషనర్ల ఎంపికని మరోసారి పరిశీలించాలని గవర్నర్ ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం. రాజకీయ చరిత్ర కలిగిన నలుగురి పేర్లను గవర్నర్ తిరస్కరించినట్టు  తెలుస్తోంది.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...