సమాచార కమిషనర్ల ఎంపిక పై వివాదం

ఫైల్ తిప్పి పంపిన గవర్నర్... 
హైదరాబాద్ , ఫిబ్రవరి 21:    సమాచార హక్కు కమిషనర్ల నియామక ఫైల్ ని గవర్నర్ నరసింహన్ ప్రభుత్వానికి తిప్పిపంపారు. ఎనిమిది  మంది కమిషనర్ల నియామకంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అనుభవంలేనివారిని నియమించారని ఆరోపణలు వచ్చాయి. ఎంపిక ప్రక్రియ రాజకీయవేదికగా మారిందని ఫిర్యాదులు వచ్చాయి. ఈ పరిస్థితులలో సమాచార కమిషనర్ల ఎంపికని మరోసారి పరిశీలించాలని గవర్నర్ ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం. రాజకీయ చరిత్ర కలిగిన నలుగురి పేర్లను గవర్నర్ తిరస్కరించినట్టు  తెలుస్తోంది.  

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు